దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నేడు దళితులను నట్టేట ముంచి, దళితులను చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం ఉన్నత పదవులు కనిపిస్తున్నాదని, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు, కే.ఎస్ జవహర్, అఖిలపక్ష నాయకులు తాటిపాకు మధు, దువ్వ శేషుబాబ్జి ఆవేదన వ్యక్తం చేసారు. దళిత సోదరుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దుచేసి జైల్లో ఉంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ కాకినాడ సిటీ నియోజకవర్గం కాస్మోపాలిటన్ క్లబ్ నందు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దళిత యువకుడ్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు బైల్ రద్దు చేసి శిక్షించాలని కోరుతూ త్వరలో భవిష్యత్తు కార్యచరణ చేపడుతున్నామని పిలుపునిచ్చారు.
దళితాగ్రహ రౌండ్ టేబుల్ సమావేశంలో టిడిపి మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కే.ఎస్ జవహర్, సిపిఐ సిపిఎం నాయకులు తాటిపాక మధు, దువ్వా శేషుబాబ్జి, గొల్లపల్లి సూర్యారావు, కొండ్రు మురళి, మహాసేన రాజేష్, అయితాబత్తుల ఆనందరావు, ఆర్పిఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పెట్ట వరప్రసాద్, గోపాలపురం టిడిపి ఇన్చార్జ్ మద్దిపాటి వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.