ధర్నా చౌక్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేదా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు అనుమతించాలని కోరుతూ దుసర్లపూడి రమణ రాజు గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం ఆయనకు మద్దతు తెలియజేశారు.
కలెక్టర్ కార్యాలయం ముందు గతంలో రాజకీయ పార్టీలు ధర్నాలు నిర్వహించి కలెక్టర్ లేదా జే.సీ. వంటి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించే వారని, ఇప్పుడు అధికారులు ఒకచోట ధర్నా చౌక్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రాంతం మరొకచోట ఉండడంతో వినతిపత్రం ఇచ్చేందుకు రాజకీయ పార్టీ ప్రతినిధులు, ప్రజా సంఘాలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయన్నారు. పైగా ధర్నా చౌక్ ప్రాంతంలో కనీస వసతులు లేవని బిజెపి నాయకులు ఆరోపించారు.
ధర్నా చౌకను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసే ముందు కనీసం రాజకీయ పార్టీలను సంప్రదించిన దాఖలాలు లేవని, ఒకరు లేదా ఇద్దరు తమకు అనుకూలమైన వ్యక్తులతో సమావేశం నిర్వహించి కలెక్టరేట్ నుంచి ధర్నా చౌక్ ను మార్చడం జరిగిందన్నారు. ధర్న చైక్ పై వెంటనే నిర్ణయం తీసుకోవలని బీ.జే.పీ. నాయకులు డిమెండి చేసారు.