రాష్ట్ర ప్రభుత్వం నూతన సంకేతిక పరిజ్ఞానాన్ని పెంపోందిచే దిశగా వినూత్న కార్యాక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదద్దడానికి ఎస్.టీ.పీ.ఐ లీప్ ఎహెడ్ పేరిట కొత్త పతకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం లో కొత్త స్టార్ట్ అప్ కంపెనీలకు, గ్రోత్ స్టేజ్ లో ఉన్న కంపెనీలకు ప్రోస్తాహం కల్పించనున్నట్లు తెలిపింది.
ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే స్టార్ట్ అప్ పరిశ్రమలకు రూ.1 కోటి వరకు ఆర్ధిక సహాయం అందిచనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో ఎంపికయిన స్టార్ట్ అప్ లకు శిక్షణ ఇచ్చి మార్కెటింగ్, ఫండ్ రైసింగ్ లో అవకాశం కల్పిస్తుంది. ఇందుకుగాను ఈ నెల 10వ తేధీ వరకు దరకస్తులు స్వీకరిస్తామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.