కాకినాడ ధర్నాస్థలి మార్పు విషయమై రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల నుండి అభ్యంతరాలు సూచనలు సలహాలు వినతి పూర్వక పత్రాలు స్వీకరించేందుకు సోమవారం సాయంత్రం 4గంటలకు కాకినాడ ఆర్.డి.ఓ. మీటింగ్ హాలులో అఖిల పక్షం తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతిక్ శుక్లా ఆదేశాల మేరకు ఆర్.డి.ఓ. కిషోర్ సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ధర్నాస్థలి అంశంపై సూచనలను వినతి పత్రంగా కూడా అందించాలని కోరారు.