ఈ నెల 9 వ తేదీ గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కు విద్యార్థినీ విద్యా ర్థులు సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి ప్రకటనలో పేర్కొన్నారు . జిల్లా విద్యాశాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సమనస ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా ఈ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కు వేదిక ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోనసీమకు చెందిన మాజీ శాస్త్రవేత్త అనేక విశ్వవిద్యా లయాల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న కే.ఎస్.ఎన్. రావు హాజరవుతారన్నారు. 10 నుంచి 17 సంవత్సరాల విద్యార్థినీ విద్యార్థులు సమాజంలో వారు గుర్తించిన సమస్యలకు శాస్త్రీయ ఆలోచన దృక్పథంతో మరియు మంచి ఆశయాలతో రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించడం జరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం తెలిపారు. పాఠశాల నుండి ఆన్లైన్లో నమోదు చేసుకున్న 215 ప్రాజెక్ట్స్ నుండి 105 ప్రాజెక్టులను ఎంపిక చేయడం జరిగిందని, వాటిని న్యాయ నిర్నేతల ముందు విద్యార్థినీ విద్యార్థులు గైడ్ టీచర్ సహాయంతో వివరిస్తారని జిల్లా సైన్స్ అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు ఈ నెల 9వ తేదీ గురువారం ఉదయం 9 గంటల లోపు సమనస లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణానికి హాజరుకావాలని వారు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.