పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రయాణిస్తున్న కారు గురువారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో గిడ్డి ఈశ్వరి ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఈశ్వరితో పాటు కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. సమీపంలోని ప్రజలు వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.