డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం చెల్లూరు గ్రామంలోని యర్రమట్టిపురంలో ఒక రేకుల షెడ్ నందు పి.డి.ఎస్. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంపై సోమవారం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. ఈ తనిఖీలలో 24 బస్తాలలో సుమారు 1035 కేజీల PDS బియ్యంను గుర్తించామని అధికారులు తెలిపారు.
సదరు పి.డి.ఎస్ ను కోట సత్యం, తండ్రి గనియ్య అనే వ్యక్తులు చెల్లూరు, పాశర్లపూడి గ్రామములలోని రేషన్ కార్డుదారుల నుండి కిలో రూ. 14/- లకు కొనుగోలు చేసి మొక్క జొన్న విత్తనలతో కలిపి రూ. 16/- లకు కోళ్ళ ఫారాలకు విక్రయిస్తున్నారని వెళ్లడించారు. సదరు బియ్యంకు సంబందించి ఎటువంటి బిల్లులు లేనందున సివిల్ సప్లయ్స్ అధికారులు రూ. 53,092/- లు విలువ గల 1035 కేజీల పి.డి.ఎస్. చౌక బియ్యాన్ని మరియు ఎలక్ట్రానిక్ కాటాను సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి, PDS బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, అమ్మకం చేస్తున్న సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు కొసం సిఫారసు చేయటమైందని తెలిపారు.