పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రారంభించారు. భానుగుడి పోలీసు కన్వెన్షన్ సెంటర్ లో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో పోలీసు సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు , మహిళా పోలీసులకు బీపీ, డయాబెటిక్, కార్డియాలజీ, గైనెకాలజీ సంబంధిత పరీక్షలను మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చేశారు.