కాకినాడ జిల్లా సామర్లకోట ప్రతిభ పాఠశాలలో సోమవారం ఎల్.కె.జి., యు.కె.జి., 1వ తరగతి చిన్నారులు ఏర్పాటుచేసిన వెజ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పాఠశాల కరెస్పాండెంట్ ఎస్.వి.వి.జి. ప్రకాష్, డైరెక్టర్ సుధారాణి, ప్రకాష్ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పాఠాశాలల్లో ఇటువంటి కార్యక్రమాల నిర్వహించడం ద్వారా విద్యార్థులకు తమ నిత్యజీవితం సమాజంతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకోవడమేగాక, వాటి ఉపయోగాలు కూడా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులుకూడా తమపిల్లలను మార్కెట్లు, బ్యాంకులు, మొదలగు వాటికి తీసుకునివెళ్లి వాటిపనితీరు, ఉపయోగాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించాలని సందేశమిచ్చారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి. సునీత, వైస్- ప్రిన్సిపాల్ పి. శ్రీగౌరి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులనుండి కూరగాయలు కొనుక్కుని ఉత్సాహపరిచారు.