రాజ్యాంగం ప్రసాదించిన 19 ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఉద్యోగికి సమ్మె చేసే అధికారం కల్పించబడిందని, తమ సమస్యలపై గత 14 వ తారీకు నుండి వివిధ రూపాల్లో దసలవారీగా పోరాటం చేస్తున్న ఏ.పీ. ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం మెట్టు దిగు రాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఏ.పీ. జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు తో ఏ.పీ. జేఏసీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమ కార్యాచరణ లో భాగంగా స్థానిక ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 14వ తేది నుండి ప్రారంభమైన ఈ ఉద్యమం ఉదృత స్థాయికి చేరుకుంది.
ప్రభుత్వానికి 27న మరో పరీక్ష..!!!
![WhatsApp Image 2024-02-22 at 1.35.42 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-22-at-1.35.42-PM.jpeg?resize=1296%2C700&ssl=1)