తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం పందలపాకలో తెలుగు దేశం పార్టీ సమావేశల కోసం నూతనంగా పార్టీ కార్యలయాన్ని నిర్మించారు. ఆ కార్యలయాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మొదట తెలుగు దేశం పార్టీ సృష్టి కర్తయిన ఎన్.టీ.ఎర్. విగ్రహానికి పూల దండలు వేసి నమస్కరించి జండాను ఎగరవేసారు. తదనంతరం రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగనున్న ఎన్నికల్లో తెలుగు దేశం జనసేన మూకుమ్మడిగా విజయం సాదిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీ.డీ.పీ. కార్యకర్తలు పాల్గొన్నారు.