తొలి తరం కమ్యూనిస్టు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్.సీ.పీ.ఐ. నేత బిష్ణు ప్రసాద్ రావా 115 వ జయంతి సందర్భంగా కాకినాడ కార్యాలయంలో పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… భారతదేశంలో 15 ఆగస్ట్ 1947న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రావా తన సహచరులతో కలిసి తమ చేతుల్లో నల్లజెండాలతో “యే ఆజాదీ ఝూతీ హై” అని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్.సీ.పీ.ఐ. భారతదేశ నిజమైన స్వాతంత్ర్యం కోసం వారి హక్కుల కోసం పోరాడుతుందన్నారు. కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రావా స్ఫూర్తితో ముందుకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. నాగమణి, కాకినాడ జిల్లా కార్యదర్శి డి. నారాయణమూర్తి, సహాయ కార్యదర్శి మంగ, బి. పద్మావతి, బొత్స యేసు తదితరులు పాల్గొన్నారు.