బంగాళాఖాతంలో ఏర్పడే తీవ్ర తుఫాను రానున్న రోజుల్లో భారతదేశంలోని అనేక పశ్చిమ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబైకి చెందిన వాతావరణ పర్యవేక్షణ సమూహం, ముంబై నౌకాస్ట్ తాజా అప్డేట్ల ప్రకారం… ఈ తుఫాను మే 23 నుంచి 27 మధ్య ప్రభావం చూపుతుందని తెలిపారు.
ప్రస్తుతం తుఫాను తీవ్రతరం అవుతోందని, పశ్చిమ దిశగా పురోగమించే ముందు భారతదేశ తూర్పు తీరంలో ల్యాండ్ఫాల్ చేస్తుందని అంచనా వేయబడింది. తుఫాను తీరం గుండా వెళితే మే 28 నాటికి ముంబై నగరానికి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భవిష్య సూచకులు హెచ్చరిస్తున్నారు.