ముఖ్యమంత్రి ప్రసంగం పై జనసేన నాయకులు సీరియస్
మహిళలను…. అక్క, చెల్లెమ్మలుగా సంభోదిస్తూ మరోపక్క వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత మాత్రం తగదని పెద్దాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి( బాబు) తీవ్రంగా విమర్శించారు. సామర్లకోటలోని గణపతి నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామర్లకోటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జిల్లా యంత్రాంగం అంతా ఉపయోగించుకుని జన సమీకరణ చేసి అభివృధి గురించి ఏమాత్రం తెలపకపోవడం విచారకరమన్నారు. మరలా ఎన్నికైతే ఏమీ చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. దోచుకోవడం, దాచుకోవడం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని తీవ్రంగా దుయ్యబట్టారు. వాటి గురించి మాట్లాడటానికి అర్హత లేదన్నారు. జగన్ మోహన్ కి మించిన పెద్ద గజ దొంగ రాష్ట్రంలో ఎవరూ లేరని విమర్శలు సందించారు.పేరు చివర రెడ్డి అని తోక తగిలించుకుని కులాల గురించి మాట్లాడం ఎంతో హాస్యాస్పదమన్నారు. మా ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పడం కాదని ఆచరించి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పిట్టా జానకీ రామరావు, సరోజ వాసు, మంచెమ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.