ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 3 వ తేదీన 53,35,519 మంది 0-5 మధ్య వయసు గల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. పల్స్పోలియో-2024 పై స్టేట్ టాస్క్ఫోర్స్ సమావేశం ఎం. టి.కృష్ణబాబు అధ్యక్షత వెలగపూడి లోని సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె. నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డా. వెంకటేశ్వర్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.