బీ.ఆర్.ఎస్. నేతల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు దిగజారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎం.పీ. వీ. హనుమంత రావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి బీ.ఆర్.ఎస్. ను ఓడించారు. ఇప్పుడు మన పార్టీ బీ.ఆర్.ఎస్. నేతలకు ఎందుకు స్వాగతం పలుకుతోంది? బీ.ఆర్.ఎస్. నేతలను పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేయొద్దని అన్నారు. రేవంత్ వెళ్లి బీ.ఆర్.ఎస్. నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదన్నారన్నారు.
ఇలాంటి సమస్యలను వ్యక్తిగతంగా ప్రస్తావించేందుకు రేవంత్ సమయం ఇవ్వడం లేదని హనుమంతరావు ఆరోపించారు. గులాబీ పార్టీ హయాంలో డబ్బులు సంపాదించి బీ.ఆర్.ఎస్. నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ కేడర్కు న్యాయం చేయకుండా మాపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని అన్నారు. బీ.ఆర్.ఎస్. హయాంలో ఎక్కడికెళ్లినా కేసులు పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసారు. బీ.ఆర్.ఎస్. హయాంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని హనుమంతరావు ముఖ్యమంత్రిని కోరారు.