రాజమహేంద్రవరం నవంబరు 26 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని విభజన హామీలు అమలు చేస్తానని ఢిల్లీకి తలదన్నేలా రాష్ట్ర రాజధాని నిర్మిస్తానని 9 ఏళ్ల క్రితం ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీలు కుప్పించిన మోడీ ఆ హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా తిరుపతి ఎలా వస్తారని అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మోడీ తిరుపతి రావడాన్ని వ్యతిరేకిస్తూ సీ.పీ.ఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, బాబాసాహేబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ మోడీ నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు.
ఈ సందర్భంగా సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ… మోడీ దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఎన్నికలు రాగానే దేశంలో ఉన్న అన్ని దేవుళ్ళు గుర్తుకొస్తారని ఆయన అన్నారు. భారత్ సార్వభౌమ, సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అని అదేవిధంగా ఆదేశ సూత్రాల న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం చేకూరాలని నిర్దేశిస్తున్నాయిని మధు అన్నారు.