భారత సైన్యం స్వదేశీ-అభివృద్ధి చెందిన మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఆయుధ వ్యవస్థ యొక్క క్షేత్ర పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఇది బలగాల ఆయుధశాలలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. ఆయుధ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డీ.ఆర్.డీ.ఓ. డిజైన్ చేసి అభివృద్ధి చేసిందని అధికారులు తెలిపారు.
మొత్తం వ్యవస్థలో ఎం.పీ.ఏ.టీ.జీ.ఎం., లాంచర్లు, లక్ష్య సేకరణ పరికరం మరియు అగ్ని నియంత్రణ యూనిట్ ఉన్నాయి. అధునాతన సాంకేతికత ఆధారిత రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో స్వావలంబనను సాధించడంలో ఇది ఒక ముఖ్యమైన దశగా పేర్కొంటూ.. ఈ వ్యవస్థ యొక్క విజయవంతమైన ట్రయల్స్ కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీ.ఆర్.డీ.ఓ. ను, భారత సైన్యాన్ని అభినందించారు.