మరో 100 రోజుల్లో యువత బంగారు భవిష్యత్తు దిశగా పయనిస్తుందని , నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిర్వాసితులకు కాకినాడ నగరంలోనే సొంత గృహాల ఏర్పాటు టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వం చేపడుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. జగన్నాధపురం 21, 16 డివిజన్ల పరిధిలో ఉన్న మత్స్యకార యువత అధిక సంఖ్యలో ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి రోజురోజు ప్రజాదరణ విపరీతంగా లభిస్తుందన్నారు.