తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే. హరిచంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి హెటిరో డ్రగ్స్ కంపెనీ జూనియర్ కెమిస్ట్, ఆఫీసర్/కెమిస్ట్, ఇంజనీర్, సూపెర్వైజర్ పోస్టుల భర్తీ కొరకు రాజమహేంద్రవరంలో షెల్టన్ హోటల్ సమీపంలో, హేచ్.పీ. పెట్రోల్ పంప్ వెనుక జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఇంటర్వూలు నిర్వహిస్తామని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులు నక్కపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇంటర్వూలకు 2020, 2021, 2022, 2023 సంవత్సరం లో ఉతీర్ణలైన బిఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్/అనలిటికల్, బి ఫార్మసీ, బి.టెక్ కెమికల్, డిప్లొమా మెకానికల్ వరకు చదువుకున్న 19-26 సం.ల వయసు గల నిరుద్యోగ యువకులు మాత్రమే అర్హులని వెళ్లడించారు.
ఎంపికైన అభ్యర్థులకు వార్షిక జీతం రు. 2.35 లక్షలు నుంచి రూ.3 లక్షలు ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం , సహాయం కొరకు 8247437773 నెంబర్ సంప్రదించగలరనీ తెలియ జేశారు.