ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్సైన్సెస్, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో రామచంద్రాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రేడియో అల 90.8 ఎఫ్.ఎం, మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఎన్.టి.ఆర్ బీచ్ పరిశుభ్రత కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జె. నరసింహ నాయక్ విచ్చేసారు. బీచ్ పరిశుభ్రతా కార్యక్రమాన్నిలాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరించరాదని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలతో సముద్రాలను కలుషితం చేయడం వలన పర్యావరణ సమతుల్యతను సర్వనాశనం అవుతుందన్నారు.