అస్సాం లోని నాగావోస్ జిల్లాలో ఒక వింట ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో నివసిస్తున్న ఓక వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ కి వెళ్లాడు. కాని అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన నుంచి రెండు మూడు పాముల తలలు బయటు కనిపించాయి. అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.
వెంటనే అక్కడున్న స్థానికులను పిలిచాడు. స్థానికంగా పాముల్ని పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో 30కి పైగా పాములు ఉన్నాయి. దానితో వాటన్నింటినీ బయటకి తీసి అక్కడి నుంచి తరలించారు. వాటర్ ట్యాంక్ కడగకపోవడంతో ఆ పాములన్ని అక్కడికి చేరివుండవచ్చని స్థానికులు తెలిపారు.