విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పట్టణం లో వన్ టౌన్ పరిదిలో గణేష్ ను హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరికడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమచారంతో ఘటనా స్తలానికి వెళ్లిన పోలీసులు హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు.