ఒకే కంపెనీలో పనిచేస్తున్న యువతి, యువకుడు ఒకరిపై ఒకరు కత్తితో దాడిచేసుకున్న ఘటనలో యువతి సువ్వాడ సుజాత అక్కడక్కడే మృతి చెందింది. విశాఖపట్నం ద్వారకానగర్ మూడో లైన్ సత్య శ్రీదేవి కాంప్లెక్స్ లో ఈ సంఘటన జరిగింది. యువకుడు ఉమా మహేష్ కు తీవ్ర గాయాలు కాగా విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. డబ్బు వ్యవహారంలో ఇద్దరు మధ్య వివాదం తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరం కత్తితో దాడిచేసుకున్నట్టు తెలిసింది. ఈ ఖద్వారక సిఐ సింహాద్రి నాయుడు దర్యాప్తు చేస్తున్నారు.