ఆరోగ్యమే మహాభాగ్యంగా అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపాట్టారు. వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద ప్రజలకు అందజేస్తున్న ఆర్థిక సహాయం గరిష్ట పరిమితిని 5 రెట్లు పెంచాలని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల కవరేజ్ ను రూ. 25 లక్షలకు పెంచినట్లు తెలిపింది. సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం ఈ విషయంపై ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి సీ.హెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.