కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ రామారావు పేట నందు డా. S.V.S రావు నూతనంగా నిర్మించిన శ్రీరస్తు కన్వేషన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజి మంత్రి, వై.ఎస్.అర్. కాంగ్రెస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ని డా. S.V.S. రావు పుష్ప గుచ్చం ఇచ్చి షాలవా కప్పి ఘనంగా స్వాగతించారు. తదనంతరం ఆయన రిబ్బని కటింగ్ చేసి కన్వేషన్ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. S.V.S రావు, మాజీ మంత్రి కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.