సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో ఆరోగ్య సేవలు సాధించవచ్చునని మంత్రివ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రపురం నియోజవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పారిశుద్ధ్య కార్మికుల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని లైన్స్ క్లబ్ లో పారిశుధ్య కార్మికుల అభినందన సభలో బీ.సీ. సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం అర్బన్, రామచంద్రపురం రూరల్ కే గంగవరం, కాజులూరు మండలాలు చెందిన 283 పారిశుధ్య కార్మికులతో రామచంద్రపురం పట్టణంలోని లైన్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అభినందన సభ లో మంత్రి మాట్లాడుతూ… స్వచ్ఛత – మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాన్ని స్వచ్ఛ, స్వేచ్ఛ, స్నేహ, సేవ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.