దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, ప్రియాంక భాను మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో దేశభక్తితో పాటు సామాజిక బాధ్యతను పెంపొందింప చేయడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.