కాకినాడ సామర్లకోట జాతీయ రహదారికి ఇరువైపులా వున్న ఉప్పుటేరుకు వెళ్ళే కాలువ మార్గాల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. 2005లో పూర్వ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కాకినాడ సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు గత ఇరవై ఏళ్లుగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గుర్రపుడెక్క పారిశుద్ధ్యచెత్త డెబ్రిస్ తుప్పలు, కెనాల్ గట్ల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అడ్డగోలుగా రోడ్డు పొడవునా కాలువపై నిర్మించిన సిమెంటు తూరల మార్గాలు ఎక్కు వయ్యాయన్నారు.
నాలుగులైన్ల రోడ్డు, నిర్మాణం విద్యుత్ స్తంభాల ఏర్పాటు లేకపోవడం వలన స్మార్ట్ సిటీ నుండి సామర్లకోట ప్రయాణం నరకకూపంగా మారిందన్నారు. వర్షాల నుండి మొదలయ్యే ఎగువ రాష్ట్రాల వరదలకు వచ్చి పడే ముంపు బెడద తట్టుకునే విధంగా ఉప్పుటేరు నుండి తూర్పు సముద్రానికి చేరే రీతిగా అడ్డంకులు లేని కాలువ మార్గాలకు వీలుగా వేసవి ఎండల్లో ప్రక్షాళన ప్రణాళిక చేపట్టడం శ్రేయస్కరమని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు విజ్ఞప్తి చేశారు.