సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో లేబర్ గదిలో ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో లేబర్ గదిలో ఉన్న ప్రిజ్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఫ్రిజ్ పేలడంతో ఒక్కసారి ఆసుపత్రి అంతా పొగలు కమ్మగా ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. హై ఓల్టేజ్ కారణంగా పేలుడు సంభవించిందని చెప్పారు.