కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు గడిచిన సందర్బంగా కాకినాడలోని సూర్యకళ మందిరంలో ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ భారీ సభను నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. ఆయన మీడయాతో మాట్లాడుతూ… నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళ్లు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు.
ఏ.ఐ.సి.సి. రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల నుంచి విరాళాలను సేకరిస్తున్నామని ఆయన తెలియచాశారు. ఈ విరాళానికి 138 రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వవచ్చన్నారు.