దేశం కోసం సరిహద్దుల్లో అహోరాత్రులు శ్రమిస్తున్న దేశ సైనికుల సంక్షేమార్గం డిసెంబర్ 7 తేదీన ఆర్మీ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా పతాక నిధికి విరాళాలు సేకరిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకులు వెంకటరావు పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. దీనిలో భాగంగానే కలెక్టర్ ప్రోత్సాహంతో గత సంవత్సరం 2022 లో సుమారు 36 లక్షల రూపాయలు విరాళాలు సేకరించినట్లు తెలిపారు.
సేకరించిన విరాళాలు పతాక నిధికి జమ చేసి తద్వారా వచ్చిన వడ్డీ ద్వారా మాజీ సైనికుల సంక్షేమానికి ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశం కోసం శ్రమిస్తున్న సైనికులకు మన వంతు సాయంగా పతాకనిదికి విరివిగా విరాళాలు అందజేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.