హన్మకొండ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వడ్డేపల్లి చర్చి సమీపంలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గమనించి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. జరిగిన ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడ స్థానికులు తెలిపారు. మంటలకు గల కారణం తెలియాల్సివుంది.