హిమాచల్ ప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సిర్మౌర్ జిల్లాకు చెందిన రోహిత్ చౌహాన్ అనే 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తన బోర్డ్ పరీక్షల్లో ఫైల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 18 ఏళ్ల యువకుడు పవోంటాలోని సూరజ్పూర్ గ్రామంలో ఉన్న తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. పవోంటా డీఎస్పీ అదితి సింగ్ తెలిపిన వివరాల ప్రకారం… 12వ తరగతి బోర్డు పరీక్షల్లో రెండోసారి ఫెయిల్ అయిన రోహిత్ తీవ్ర ఒత్తిడికి లోనవ్వడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. అతడిని పావుంటా సివిల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.